Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో భేటీ అవుతున్నారు. ఎన్నారై టిడిపి నేత వేమన సతీష్ తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డుతో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా విజయానికి ప్రవాసులు కృషి చేయాలని, ప్రభుత్వ ఏర్పాటుకు వారి అవసరం గురించి చర్చించారు. తెదేపా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ఎన్నారైలు తమ వంతు పాత్ర చిత్తశుద్ధితో పోషిస్తామని సతీష్ చంద్రబాబుకు వెల్లడించారు. ఏపీలో తాను కూడా ప్రచారం చేస్తానని సతీష్ పేర్కొన్నారు. ఎన్నారై తెదేపా శ్రేణులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Breaking News