Vivek Ramaswamy :
అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ తీరును వ్యతిరేకిస్తూ చాలా మంది రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అందులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేరు కీలకంగా వినిపిస్తుండగా, ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో మరికొందరు వెలుగులోకి వస్తున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన వివేకా రామస్వామి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రసంగాలు కూడా ప్రస్తుతం సంచలన మవుతున్నాయి.
తనకు అమెరికా అభ్యున్నతే ముఖ్యమంటూ వివేక్ అక్కడి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక ట్రంప్ ను అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తానని, లేదంటే తాను బరిలో ఉంటానని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇటు ఇండియా, అటు అమెరికాలో వైరల్ అవుతున్నాయి. భారత్ లోని కేరళ రాష్ర్టంలో పాలక్కడ్ కు చెందిన కుటుంబంలో వివేక్ రామస్వామి జన్మించారు. వారి కుటుంబమంతా అమెరికాలోనే స్థిరపడింది. ఆయన పారిశ్రామిక వేత్తగా అక్కడ విజయవంతమయ్యారు.
ప్రస్తుతం ఆయన హెచ్ 1 బీ వీసాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. హెచ్ 1 బీ వీసా మీద వచ్చి ఇక్కడ పెద్ద సంఖ్యలో విదేశీయులు ఐటీ, సాఫ్ట్ వేర్, ఇంటెల్ , తదితర రంగాల్లో రాణిస్తున్నారు. హెచ్ 1బీ వీసా మీద వస్తూ ఆ తర్వాత కుటుంబాలను తీసుకొస్తున్న వారికి ఇదొక షాకింగ్ నిర్ణయంగా కనిపిస్తున్నది. గ్రీన్ కార్డు కలిగిన వారు చేస్తున్న చైన్ బేస్ డ్ మైగ్రేషన్ పై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఐడియాలు కూడా సంచలనంగా మారాయి. దేశ ప్రయోజాలే ముఖ్యమని, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. తాను దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే ట్రంప్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఇదివరకే వివేక్ ప్రకటించారు. చైనా విషయంలోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పాల్గొంటున్న చర్చా వేదికలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.