Mangalagiri : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళగిరి దుమ్మురేపింది. పాదయాత్రకు సంఘీభావంగా భారీగా మంగళగిరి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. భారీ గజమాలతో నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైల్వే గేట్ వద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. గజమాలలు, సంప్రదాయ నృత్యాలతో హోరెత్తిపోగా, టీడీపీ క్యాంప్ లో సరికొత్త జోష్ కనిపించింది. నిడమర్రు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర… బేతపూడి బాపూజీనగర్, మంగళగిరి రైల్వేగేట్, మార్కెట్ యార్డు, పాతబస్టాండు, మున్సిపల్ ఆఫీసు, ఆర్టీసి బస్టాండు, నవులూరు రోడ్డు మీదుగా యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.
ఓడినా జనాల మధ్యే ఉన్నా..
యువగళం పాదయాత్ర మొదటి నుంచీ వైసీపీపై విరుచుకుపడుతున్న నారా లోకేష్ మంగళగిరిలో మాత్రం మరింత ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తాను ప్రజల మధ్యే ఉంటున్నానని, గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం పరదాల చాటున దాక్కుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, 2019లో మంగళగిరి ఓటర్లు తనపై కరుణ చూపకున్నా ప్రజల మధ్యే ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారి వెన్నంటే ఉంటున్నానని చెప్పారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను తన వ్యక్తిగత నిధులతో చేపట్టానని వివరించారు. అయితే యువగళం పాదయాత్రతో మంగళగిరికి వచ్చిన లోకేష్ కు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అధికార పార్టీ తాయిలాలకు కొందరు టీడీపీని వీడినా ఆ లోటు మాత్రం కనిపించడం లేదు. పార్టీ మారినంత మాత్రాన ఇక్కడ టీడీపీకి పెద్దగా నష్టపోయిందేమీ లేదు. అయితే అది అధికార పార్టీకి మైనస్ మారుతున్నది. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
మంగళగిరిలో ఓడిన ప్రత్యేక వ్యూహం ద్వారా వైసీపీకి పట్టు ఉన్న గ్రామాల్లోకి వెళ్లారు. అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పనితీరు మైనస్ గా మారింది. అతనికి టిక్కెట్ వచ్చే అవకాశం లేదని స్పష్టం కావడంతో వైసీపీ శ్రేణులు పట్టించుకోవడం మానేశాయి. టీడీపీ నాయకుడు గంజి చిరంజీవికి టిక్కట్ ఇస్తామంటూ వైసీపీలో చేర్చుకున్నారు. కానీ అతనిని కూడా పక్కన పెట్టేస్తున్నార. మరో అభ్యర్థి కోసం జగన్ చూస్తున్నారు.
ఇక్కడ అధికార పార్టీలోని వ్యతిరేకత టీడీపీకి లాభిస్తున్నది. మంగళగిరిలో లోకేష్ కు లభించిన మద్దతుపై అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. ఎలాగైనా లోకేష్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నది.