UP CM Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలోని వివిధ ప్లా్ట్ ఫామ్ లలో యోగి ఆదిత్య నాథ్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ దేశంలోని ముఖ్యమంత్రుల స్థానంలో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. దీంతో పాటు భారత్ లోని రాజకీయ నాయకుల్లో థర్డ్ ప్లేస్ లోకి వెళ్లారు.
ఇటీవల యోగి ఆదిత్యనాథ్ వ్యక్తి గత ‘ఎక్స్’ ఖాతా (@myogiadityanath) 27.4 మిలియన్ల ఫాలోవర్ల మైలు రాయిని అధిగమించింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత ’ఎక్స్‘ ఖాతాల విషయంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తర్వాతి స్థానంలో యోగి ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
యోగి ఆదిత్య నాథ్ సోషల్ మీడియా రీచ్ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రముఖులను మించిపోయింది. ‘ఎక్స్’లో వరుసగా 24.8 మిలియన్లు, 19.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. యోగి వ్యక్తి గత కార్యాలయ ఖాతా (@myogioffice) 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.
2019 జనవరిలో ప్రారంభమైన ఈ ఖాతా దేశంలోనే అతిపెద్ద పర్సనల్ ఆఫీస్ ఖాతాగా అవతరించింది. యోగి ఆదిత్య నాథ్ నిర్ణయాత్మక నాయకత్వం, ప్రభావవంతమైన నిర్ణయాలు ఆయనకు అపారమైన ప్రజాదరణను సంపాదించడమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ‘యోగి మోడల్’గా పిలిచే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభావితం చేశాయని ఆయన కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది.
ఇటీవల అయోధ్యలో ప్రభు శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట విజయవంతంగా నిర్వహించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందాడని, యోగి ఆదిత్యనాథ్ ప్రశంసనీయ నాయకత్వాన్ని ప్రదర్శించిందని పేర్కొంది.