YV vs Vijayasai :
వైసీపీలో ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు తరచూ బయటపడుతున్నాయి. నియోజకవర్గాల్లోనే ఈ తలనొప్పి పెరుగుతుండగా, ఇక పార్టీలో ముఖ్యనేతల మధ్య కూడా ఇదే స్థాయిలో వార్ నడుస్తున్నట్లు సమాచారం. విశాఖలో భూదందాల విషయంలో విజయసాయి వర్సెస్ వైవీ గా ప్రస్తుతం సీన్ మారింది. దసపుల్లా భూములను వైసీపీ నేతల కొట్టేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంపైనే వైవీ పలువురి అరెస్ట్ కు ఆదేశించినట్లు సమాచారం.
అయితే ఇక్కడ అరెస్ట్ చేయాల్సింది వైసీపీ నేతలను కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. వీళ్ల మధ్య వర్గపోరు తమకు ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. విజయసాయిరెడ్డి మనుషులే ఫోర్జరీ చేసి, ఈ భూములను రాయించుకున్నారనే వైవీ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పుడు సీపీ ట్రాన్స్ ఫర్ వ్యవహారంలో ఈ అంశమే కారణమని సమాచారం. అయితే ఇప్పుడు పంచాయతీ తాడేపల్లిగూడెం ప్యాలెస్ కు చేరినట్లు టాక్.
విశాఖలో కొంతకాలంగా భూదందాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఏకంగా విశాఖ ఎంపీ కుటుంబం కూడా క్నిడాప్ అయ్యింది. దీనిపై ప్రభుత్వం పనితీరుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య అధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే సీఎం జగన్ జోక్యం చేసుకున్నా, ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరడం లేదని చెబుతున్నారు. అయితే వైసీపీలో వర్గపోరు ముఖ్యనేతల మధ్య తారాస్థాయికి చేరుకోవడం అటు అధిష్టానానికి, ఇటు పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. ఏదేమైనా అధికార పార్టీలో ఇంతస్థాయిలో వర్గ విభే