AP Anganwadis : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు 21 రోజుల రోజులుగా వివిధ రూపాలలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 22వ రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతిపత్రం అందించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుం దని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 26000, గ్రాడ్యుయేట్, పిఎఫ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో అంగన్వాడిలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు.