Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయి. తెలంగాణలో పార్టీ పెట్టి నిరాశతో ఏపీలో అడుగుపెట్టి కాంగ్రెస్ భాద్యతలు చేపట్టిన షర్మిల తన అన్న, వైసిపి నేత జగన్ ను ఓడించడానికి సిద్దమయ్యింది.ఒకవైపు కూటమి, మరోవైపు ఇంటిపోరు తో సతమతమవుతున్న జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి.
గత ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగి కాకలుతీరిన నాయకుడు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించాడు జగన్.తాజా ఎన్నికల్లో జగన్ కు చుక్కలు చూపించడానికి చంద్రబాబు కూటమిని ఏర్పరచుకున్నాడు.
జగన్ ఒంటెద్దు పోకడతో ద్వితీయశ్రేణి నాయకత్వం దూరమైనది. రోజు విడిచి రోజు బస్సు యాత్ర చేపడుతున్నాడు. బస్సు యాత్రకు జగన్ స్థాయికి తగినట్టుగా జనం రాకపోవడంతో యాత్రలు వెలవెల బోతున్నాయి.తన సొంత మీడియాతో పాటు నిర్మించుకున్న సోషల్ మీడియాలో కూడా వాటినే మార్చి,మార్చి బస్సు యాత్రను ప్రసారం చేసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో వైసిపి ప్రచారంలో వెనుకబడి పోయిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతునాన్యి.ఇక జగన్ కు ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ కూడా రాకపోవచ్చనే అభిప్రాయం జనంలో వస్తోంది.
విజయమైనా,ఆపజయమైనా జగన్ కె దక్కుతుంది.ఆయన ఒక్కడే ప్రచారం చేసుకోవాలి. కానీ కూటమికి మోదీ,చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,లోకేష్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిరోజు రెండు నుంచి మూడు సభల్లో పాల్గొని జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మరికొన్ని సభలో మోడీ తో కలిసి చంద్రబాబు,పవన్ కలిసి పాల్గొంటున్నారు. వీరికి పోటీగా జగన్ చేపట్టిన బస్సు యాత్ర కళకళ లాడటంలేదు. రోజు విడిచి రోజు విశ్రాంతి తీసుకుంటూ బస్సు యాత్ర నిర్వహిస్తుంటే జనం లేక సమావేశాలు వెలవెలబోతున్నాయి.
నామినేషన్ కార్యక్రమాల్లో కూడ జనం ఆసక్తి చూపడంలేదు. జగన్ అభ్యర్థులు నామినేషన్ వేస్తుంటే ఎదో సాకు చూపుతూ తప్పించు కుంటున్నారు.జనసమీకరణకు జగన్ అభ్యర్థులు నన ఇబ్బందులు పడుతున్నారు.జగన్ స్థాయికి తగినవిదంగా జనం తరలింపు కనబడటంలేదు.కూలి పనికి వెళ్లే దినసరి కూలీలను తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేసినప్పటికిని వారు ఎండ భయంతో రాలేమంటున్నారు.దింతో వైసీపీ సభలు,సమావేశాలు,యాత్రలు జన సందోహం లేకపోవడంతో వెలవెలబోతున్నాయి.