ఏప్రిల్ 3 న అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు,ముఖ్య నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నాడు. కాగా ఆ సమావేశంలో మంత్రి వర్గ విస్తరణ , కొంతమంది మంత్రుల తొలగింపు తప్పకపోవచ్చని తెలుస్తోంది. రకరకాల ఊహాగానాల మధ్య ఏప్రిల్ 3 న సమావేశం జరుగుతుండటంతో ఎవరి పదవి ఊడనుంది ? ఎవరికి పదవి లభించనుంది ? అనే చర్చ మొదలైంది.
తమ్మినేనికి మంత్రి పదవి?
స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాంకు మంత్రి పదవి లభించనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ దృష్టిలో తమ్మినేని రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది ఎందుకంటే ….. స్పీకర్ గా తటస్థంగా వ్యవహరించాల్సిన తమ్మినేని ఏమాత్రం మొహమాటం లేకుండా మా ప్రభుత్వం అంటూ మాట్లాడుతుండటం అలాగే టీడీపీ సభ్యుల పట్ల తీవ్ర నిరంకుశంగా వ్యవహరిస్తుండటంతో తప్పకుండా ఆయనకు మంత్రి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మరింతగా చుక్కలు చూపించడం ఖాయమని భావిస్తున్నాడట జగన్.
తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మానను తప్పించాల్సి వస్తుంది. దాంతో ఆయనకు గౌరవమైన పదవి ఇవ్వాలి కాబట్టి స్పీకర్ గా ఆయన్ని నియమించవచ్చని తెలుస్తోంది. ధర్మాన సీనియర్ నాయకుడు కావడంతో స్పీకర్ పదవికి తగిన వ్యక్తి అని భావిస్తున్నాడట అధినేత.
సీదిరి అప్పలరాజుకు కూడా ఉద్వాసన తప్పదా ?
మంత్రి సీదిరి అప్పలరాజుకు కూడా ఉద్వాసన తప్పకపోవచ్చని తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన సీఎం జగన్ ను కలిసాడు. ఆ తర్వాత నాకు మంత్రి ఉన్నా , లేకున్నా బాధపడేది లేదు ఎందుకంటే వైసీపీ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మంత్రులే అంటూ వ్యాఖ్యానించి మరింత స్పష్టత నిచ్చాడు మంత్రి సీదిరి అప్పలరాజు. ఏపీ అసెంబ్లీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో మంత్రివర్గంలో స్వల్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు అధినేత జగన్మోహన్ రెడ్డి.