తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవైపు బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉండనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో తన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీ సాధించాలంటే కష్టంతో కూడుకున్న పని కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోలేదు. బీసీల్లో అలాగే సెటిలర్స్ ఓట్లను ప్రభావితం చేయగల సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకుంది. దాంతో తనకు మైనస్ అవుతున్న ఓట్లను తెలుగుదేశం పొత్తు లేదంటే సైలెంట్ మిత్రపక్షంగా ఉంటే తనకు తప్పకుండా అధికారం దక్కుతుందని భావిస్తున్నాడట.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ పొత్తు వల్లే కేసీఆర్ కు అధికారం దక్కింది అనే వాదన ఉంది. దాన్ని నిజం చేస్తూ అప్పట్లో మరోసారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టాడు కేసీఆర్. అయితే కేసీఆర్ తో టీడీపీ పొత్తు చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదట ! ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రుల ముందు తలదించుకోవాల్సి వస్తుందని భావిస్తున్నాడట. అంతేకాదు అక్కడి ప్రజలు తెలుగుదేశం కు అధికారం అప్పగించాలని చూస్తున్న క్రమంలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నాడట.
చంద్రబాబుని ఒప్పించడానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత రాయబారం నడిపిస్తున్నాడట కేసీఆర్. తెలంగాణలో ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో రకరకాల ఆలోచనలు చేస్తున్నారట కేసీఆర్.