BRS Difficulties with PM : తెలంగాణలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే సీట్లు ఖరారు చేసి ప్రచారం కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మల్లేలా కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ బాస్ తలపట్టుకుంటున్నారు.
హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడటం కాంగ్రెస్ కు లాభదాయకంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎన్డీయేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇది ముస్లిం ఓటర్లను పార్టీకి దూరం చేసినట్లు కనిపిస్తోంది. రెండు సార్లు ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉండడంతో ఆ పార్టీ మెజారిటీ సాధిస్తూ వచ్చింది.
బీఆర్ఎస్ బీజేపీకి బీ పార్టీ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎంఐఎంతో బీఆర్ఎస్ సుహృద్భావ సంబంధాలను పంచుకోవడంతో బీజేపీకి అనుబంధంగా ఉన్న మితవాద వైఖరి బీఆర్ఎస్ ద్వారా ఎంఐఎంకు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ టాక్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే అభిప్రాయం మైనార్టీలను ఆలోచింపజేస్తోంది.
ఎన్డీయేలో చేరే విషయమై బీఆర్ఎస్ చీఫ్ తనను కలిసి మాట్లాడారని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆ ఊహాగానాలకు బలం చేకూర్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగాల్లో బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్ అని చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా బీఆర్ఎస్కు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు పరోక్ష అవగాహనతో ఉన్నాయనే టాక్ 40 నియోజకవర్గాల్లో ఓటర్ల ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.