బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఏడు వారాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ వారంలోకి అడుగు పెట్టి రసవత్తరంగా సాగుతుంది. 7వ వారంలో బిగ్ బాస్ నుండి పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యింది.. ఇక 8వ వారం స్టార్ట్ అవ్వడమే అప్పుడే నామినేషన్స్ ను షురూ చేసాడు బిగ్ బాస్.. ఈ వారం కూడా ముందు కంటే గరంగరంగా నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి..
అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఒక లవ్ ట్రాక్ కూడా సెట్ అవ్వడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఈసారి వచ్చిన అమ్మాయిలను వచ్చినట్టు బయటకు పంపించేస్తున్నాడు. దీంతో అబ్బాయిలకు లవ్ ట్రాక్ నడిపేంత సమయం కానీ అవకాశం కానీ రావడం లేదు..
గత ఆరు సీజన్స్ లో ప్రేమ కథలు ఉన్నాయి. కానీ ఈసారి సీజన్ లో ఎవరు జంటలు కాలేక పోతున్నారు. వరుసగా అమ్మాయిలను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపిచేస్తూ జంటలు కాకుండా చేస్తున్నాడు బిగ్ బాస్.. గౌతమ్, శుభ శ్రీ మధ్య రిలేషన్ అలా బిల్డ్ అవుతున్న సమయంలోనే ఆమెను బయటకు పంపించాడు.
ఇక ఇప్పుడు హౌస్ లో శోభా శెట్టి, టేస్టీ తేజ మధ్య ఏదో ఉంది అనేలా వీరి ప్రవర్తన ఉంటుంది.. వీరు సన్నిహితంగా ఉంటున్నారు కానీ రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టడం లేదు.. ఒకవేళ అలాంటిది వచ్చిన కామెడీతో మ్యానేజ్ చేస్తున్నారు.. ఒకరంటే ఒకరికి స్నేహానికి మించిన ఏదో బంధం ఉందని ఆడియెన్స్ అనుకుంటున్నారు. మరి వీరి గిల్లికజ్జాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి..