తనకు వచ్చిన ఉద్యోగం కోసం ఏకంగా 28 ఏండ్లు ఒక వ్యక్తి వెయిట్ చేశాడు. దీని కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. చివరాఖరుకు ఆయన పోరాటం ఫలించింది. ఆయన ఉద్యోగం ఆయనకు వచ్చింది. అది కూడా సుప్రీం కోర్టు తీర్పుతో సాధ్యమైంది. ఒక ఉద్యోగం కోసం 28 ఏళ్లు ఫైట్ చేశాడంటే ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.
1995లో అంకుర్ గుప్తా అనే వ్యక్తి పోస్టల్ శాఖలో ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రైనింగ్ కు ఎంపికయ్యాడు. వృత్తి విద్య ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కారణంతో మెరిట్ జాబితాలో ఆయనను సెలక్ట్ చేశారు. దీంతో ఇతర అభ్యర్థులతో కలిసి అంకుర గుప్తా సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. అయితే 1999లో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ పోస్టల్ శాఖ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ 2000లో అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది.
అనంతరం 2017లో క్యాట్ ఉత్తర్వును కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయించింది. 2021లో పోస్టల్ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను కూడా సస్పెండ్ చేసింది. దీనిపై పోస్టల్ శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత జడ్జిలు త్రివేది, దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అంకుర్ గుత్తాను మెరిట్ జాబితాలో చేర్చకపోవడంపై తప్పుబట్టింది. అది వివక్షగా పరిగణిస్తున్నామని, నెలరోజుల్లోగా పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగంలో అతడిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఆ పోస్ట్ ఖాళీ లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ ను సృష్టించాలని చెప్పింది.