సాయి ధరమ్ తేజ్ ఒక వ్యక్తికి మంచి చేయాలని అనుకుంటే అదికాస్తా వికటించింది. సదరు వ్యక్తి ఉద్యోగం మానేశాడు. కుటుంబం కూడా రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాయి ధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ స్పందించి వేంగంగా ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. వేగంగా చికిత్స అందడంతో ఆయన బతికి బయటపడ్డాడు. దీంతో మెగా ఫ్యామిలీ అబ్దుల్ ఫర్హాన్ కు లక్షలాది రూపాయలు, బంగ్లా, కారు కూడా ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఒక సారి సాయిధరమ్ తేజ్ కూడా స్పందించాడు. అలాంటి డబ్బులు, బంగ్లాలు ఏమీ ఇవ్వలేదని, నా ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చానని అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పానని పేర్కొన్నాడు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అబ్ధుల్ ఫర్హాన్ స్పందించాడు. యాక్సిడెంట్ నుంచి ఆయనను కాపాడిన తర్వాత ఎవ్వరూ తనను కలవలేదు. మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకూ తనను కలిసిందే లేదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అబద్దాలే. ఇలాంటి వార్తలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక షాపులో చిన్న ఉద్యోగం చేసుకుంటాను. నా తోటి స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అందరూ మెగా ఫ్యామిలీకే సాయం చేసి కారు, బంగ్లా లాంటివి తీసకున్నావని ఏడిపించారు. దీంతో ఉద్యోగం కూడా మానేయ్యాల్సి వచ్చింది.
నా గురించి ఇప్పటికీ అబద్దాలే మీడియాలో ప్రచారం అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు సరికదా.. కారు, బంగ్లా అంటూ ఏదీ నాకు అందలేదు. ఇలాంటి ప్రచారాలు ఆపాలని అబ్ధుల్ ఫర్హాన్ కోరుతున్నాడు. చాలా మంది వెంట పడి మరీ వేధిస్తున్నారని వాపోతున్నాడు.