తెలుగు సినీ ప్రముఖులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు. కాగా ఈ పార్టీ ఎందుకోసం ఇచ్చాడో తెలుసా ……. అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెరెల్ ఇండియాకు వచ్చిన సందర్బంగా. జేమ్స్ తో పాటుగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , త్రివిక్రమ్ , కొరటాల శివ , దిల్ రాజు సోదరుడు శిరీష్ , దిల్ రాజు కుమార్తె హన్షిత , బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ , దేవినేని ప్రసాద్ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.
కాగా తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి ఎవరెవరు వచ్చారు ? అనే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.