స్టార్ హీరోయిన్ సమంతకు షాక్ ఇచ్చాడు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు. గతంలో ఈ నిర్మాత తమ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతతో భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. సమంతను కలిశారు కథ చెప్పారు …… అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కట్ చేస్తే ఈ సినిమాలో అనూహ్యంగా మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వచ్చి చేరింది.
రష్మిక మందన్న హీరోయిన్ గా సినిమా నిన్న ప్రారంభమైంది. అదేంటి ? ఈ సినిమాలో సమంత హీరోయిన్ కదా ! అని ప్రశ్నిస్తే ….. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా ……. అంతా కర్మ సిద్ధాంతం. కర్మ ప్రకారమే ఏమైనా జరుగుతుంది. స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో వాళ్ళను మాత్రమే ఎంపిక చేసుకుంటాం ……. కంటెంట్ , కర్మ సిద్ధాంతం ప్రకారమే అంతా జరుగుతుందని సెలవిచ్చాడు.
సమంతకు నిర్మాత ప్రభుకు వచ్చిన అభిప్రాయబేధాల వల్లే ఇలా ఈ ప్రాజెక్ట్ నుండి సమంత వెళ్లిపోయిందని , దాంతో రష్మిక మందన్న తో ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ” రెయిన్ బో ” అనే టైటిల్ ను ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. ఇక రష్మిక మందన్న మంచి ఊపు మీదుంది. మొదటిసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.