హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వెంకటేష్ బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు అనారోగ్యంతో మరణించారు. స్వర్గీయ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు తమ్ముడే ఈ దగ్గుబాటి మోహన్ బాబు. గుంటూరు జిల్లా కారంచేడు స్వగ్రామం కాగా అక్కడే ఉంటున్నారు. అన్నయ్య సినిమారంగంలోకి వచ్చినప్పటికీ మోహన్ బాబు మాత్రం కారంచేడులోనే ఉంటూ వ్యవసాయంతో పాటుగా ఇతర బిజినెస్ వ్యవహారాలు చేసుకుంటున్నాడు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దగ్గుబాటి మోహన్ బాబు 73 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. బాబాయ్ మరణవార్త తెలిసిన వెంటనే అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన తనయుడు దగ్గుబాటి అభిరామ్ ను తీసుకొని కారంచేడుకు వెళ్లారు. బాబాయ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఇక వెంకటేష్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నాడు. దాంతో ఈరోజు కారంచేడుకు చేరుకోనున్నారు.