29 C
India
Wednesday, May 15, 2024
More

    Bandi Sanjay : బండి సంజయ్ సంచలన ట్వీట్.. ఈటల, కిషన్ రెడ్డినే ఉద్దేశించేనా..?

    Date:

    Bandi Sanjay :  తెలంగాణ బీజేపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని నియమించడాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని మెజార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈటెల వర్గం నేతలు మాత్రం కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

    అయితే బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ర్ట బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులు, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నామని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రాధన్యత సంతరించుకుంది.

    అయితే ప్రస్తుతం తెలంగాణ కమలం పార్టీలో అనిశ్చితి నెలకొంది. బండి సంజయ్ అనుచరులంతా కొంత అసహనంతో ఉన్నారు. అయితే బండికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కబోతుందనే ప్రచారం నేపథ్యంలో కొంత సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి అధిష్టానం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తుందని అంతా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడి మార్పు రానున్న ఎన్నికల్లో పార్టీ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి కొంత క్లాస్ నాయకుడని, బండి సంజయ్ లా మాస్ జనాన్ని ఆకట్టుకోలేరని వారు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....