Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా మారిన నేపథ్యంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో నాపై నిగా పెట్టిందనీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.
నా ఫోన్ ట్యాప్ చేయించి రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని బీ ఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ , కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎంతమంది పైన నిఘా పెట్టీ తద్వారా రాజకీయ లబ్ది పొందారా అన్నది తేలాల్సి ఉంది. ఫోన్ టాపింగ్ లో ఎంతమంది ఉన్నారన్నది ఒక్కొక్క టిగా బయటికి వస్తుంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఎవరి ఒత్తిడితో ఇలా చేశా రన్నది బయటపడాల్సి ఉంది.