SS Rajamouli : దాదాపు ఎడేనిమిదేళ్ల నుంచి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతున్నదంటూ ఊహాగానాలు వచ్చాయి. వారిద్దరి అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో అని రాజమౌళి ప్రకటించడంతో మహేష్ బాబు అభిమానుల ఆనంధానికి అవధులు లేవు.
క్రేజీ కాంబినేషన్ పై అనుమానాలు
బాహుబలి సిరీస్ తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తర్వాత రాజమౌళి ఇక తెలుగు సినిమాలు చేయకపోవచ్చనే రూమర్లు వచ్చాయి. అదే సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు అమిర్, సల్మాన్, షారూఖ్ తో పాటు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, రణబీర్ కపూర్ తదితర హీరోలు రాజమౌళి వెంట పడుతున్నారు. అలాగే బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా రాజమౌళి తో అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. ఎన్ని ఆఫర్లు వచ్చినా రాజమౌళి తన ముందు ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం ఏ ఆఫర్ ను అంగీకరించలేదు. అలాగే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం కూడా లైనప్ లో ఉండడంతో తెలుగు హీరోలతో సినిమా చేస్తాడా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. భారీ సక్సెస్ లో ఉన్నా తెలుగు సినిమాకే మొగ్గు చూపాడు రాజమౌళి. ఒక్కసారిగా మహేష్ బాబుతో తన తదుపరి సినిమా అని రాజమౌళి ప్రకటించడంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది.
సూపర్ మెన్ తరహాలో
మహేష్ బాబు – రాజమౌళి చిత్రానికి SSMB29 తాత్కాలిక వర్కింగ్ టైటిల్. ఈ సినిమా ప్రకటన బయటికి వచ్చినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ విపరీతంగా వస్తున్నది. భారతీయ సినిమా చరిత్రలో మరో స్థాయిలో ఈ మూవీ చిత్రీకరించనబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ అప్డేట్ రాబోతున్నదని సమాచారం. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తున్నది. మహేష్ బాబు ను రాజమౌళి సరికొత్త లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తున్నది.
హనుమంతుడి నుంచి ప్రేరణతో అయితే మహేష్ బాబు పాత్రను తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తున్నది. రామాయణం – మహాభారతం పురాణాలను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ పాత్రలు కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఆఫ్రికన్ జంగిల్ లో సాగే సాహసాల నేపథ్యంలో సినిమా సాగనున్నట్లు సమాచారం. అడవిలో అరాచకులపై పోరాడే వీరుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారు. SS రాజమౌళి హీరో పాత్రను ఫిక్షనల్ సూపర్ మేన్ ను ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.