Jaggareddy : తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే బిఆర్ఎస్ అగ్ర నేతలైన కేటీఆర్ ,హరీష్ రావు లను ఒక ఆట ఆడుకునే వాడిని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బెంజ్ కార్లలో తిరుగుతారని బస్సుల్లో తిరిగే సామాన్యుల కష్టాలు వారికి ఎలా తెలుస్తాయని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా పూర్తి కాలేదు అప్పుడే ఇన్ని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గత పది ఏళ్ళ బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారు చెప్పాలన్నారు. కేటీఆర్ హరీష్ రావులు అనవసర ఆరోపణలు చేస్తు న్నా రని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికా కారం లోకి వచ్చిన వెంటనే కొన్ని గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామని మరికొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశలో రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అనవసర రాద్ధాంతాలు చేసి ప్రజల్లో కేటీఆర్, హరీష్ రావులు చులకన కావద్దని జగ్గారెడ్డి హితువు పలికారు.