CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా రు. లోక్ సభ అభ్యర్థుల తుది జాబితా పై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఈరోజు జరగనున్న సీఈసీ భేటీ లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో దీపా దాస్ మున్సి, బట్టి, ఉత్తం సహా కీలక నేతలతో సీఎం సమావేశం నిర్వహించి అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేశారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.
మిగిలి అభ్యర్థులను ఫైనల్ చేసి అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను ఇవ్వనున్నారు. సీఎం ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంపీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనుంది. ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఎంపీ అభ్య ర్థుల ఫైనల్ జాబితా బయటకు రానుంది.