Mahalakshmi Scheme : తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌర సరఫరాల శాఖ ఒక ప్రపకటన జారీ చేసింది.
18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని.. ఏప్రిల్ 13 నాటికి మరికొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందినట్లు పేర్కొంది. మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్వాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది.