CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టడంతో లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఫలితాలు రావాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆశలు పెట్టుకుంది. అగ్ర నాయకత్వం కూడా అదే తీరుగా ఆలోచిస్తోంది. 14-15 సీట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రచించాలని చెబుతోంది.
కాంగ్రెస్ కు ఎంత ప్రయత్నించినా 10 సీట్ల కంటే పెరగవని అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేసినా కొన్నింటిని మాత్రం వాయిదా వేస్తోంది. దీంతో ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం పూర్తిగా రావడం లేదు. రైతులకు సాగునీరు, కరెంటు కష్టాలు తీరడం లేదు. దీంతో కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదనేది వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గంప గుత్త ఓట్లు మాత్రం పడవని తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ విస్తరిస్తోంది. కాషాయ దళానికి కూడా ఎక్కువగానే సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ కు అన్ని సీట్లు రావడం కష్టమే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే కష్టపడాల్సి ఉంది. అధిష్ఠానం అంచనా వేసిన సీట్లు రాకపోతే రేవంత్ కు భంగపాటే అంటున్నారు. ఎవరి పోర్ట్ పోలియోతో వారు బిజీగా మారిపోయారు మంత్రులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా అన్ని సీట్లు రావని తెలుస్తోంది.
ప్రస్తుతం భారమంతా రేవంత్ రెడ్డిపైనే ఉండడంతో ఆయన కాలుకు బలపం కట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఒంటరిగానే పోరాటం చేయక తప్పదని తెలుస్తోంది. రేవంత్ శ్రమకు తగిన ఫలితం వస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో వచ్చిన ఫలితాలు దేశం అంతటా రావాలని ఆశిస్తోంది. దీనికి రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకుంటోంది.
తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ డీలా పడినా బీజేపీ సైతం పది స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో మన రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందే.