Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. కాసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశం అయ్యారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాయుడు జాయిన్ అయ్యారు. పార్టీలో చేరి 10 రోజులు గడవకముందే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు అంబటి రాయుడు ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రాబోతుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక తాజా ,మాజీ నేతలు బయటికి వస్తున్నారు. వారిలో ఇప్పటికే కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా మరి కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ కావాలని ఆలోచి స్తున్నారు. వైసీపీలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదని పలువురు నేతలు వాపోతున్నారు. ఇన్చార్ ల మార్పు నేపథ్యంలో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో పార్టీలో కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో నేతల ఖాళీ కావడం ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.