Minister Peddireddy : ఈనెల 26 నుండి మేము సిద్దం బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభం అవు తుందని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 27 న నంద్యాల జిల్లాలో 28 న కర్నూలు జిల్లాలో మేము సిద్దం బస్సు యాత్ర చేపడుతున్నా మని మంత్రి తెలిపారు.
సిద్ధం బస్సు యాత్రకు ఉమ్మ డి కర్నూలు జిల్లా నేతలు సిద్ధం కావాలని మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి పిలుపుని చ్చారు. బస్సు యాత్ర పై ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే,ఎంపీ, నియోజ వర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.