AP: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు. అసలు పెద్దిరెడ్డికి క్యారక్టర్, క్రిడిబులీడి ఉన్నాాయా అని ఆయన విమర్శలు చేశారు. డబ్బు, కారు, పెడితే, భోజనం పెడితే చాలు సభలకు వస్తారని పెద్దిరెడ్డి అనుకున్నాడని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి కి దమ్ము ధైర్యం ఉంటే నగరి తిరుపతి,చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని ప్రశ్నించారు.. మీకు రిజర్వాడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే నేను సీనియర్ లీడర్ నని నాలాగా ఎప్పుుడైన సర్పంచ్ గా గెలి చాడా అని ఆయన ప్రశ్నించారు.నేను ఎంపీటీసీ,ఎంపిపి పనిచేశాను అని ఎంతోమంది సిఎం లను చూ శాను అని ఆదిమూలం అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినా కుట్ర,మోసం చేయడం వల్ల నాకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశాడని ఆయన ఆరోపించారు. ఇసుక,గ్రావెల్ దోచుకుంటున్న దొంగలే నాపై దోంగ రిపోర్టు ఇచ్చారని సిఎం జగన్ కే చెప్పాను అని ఆయన తెలిపారు. రెండు నెలలు నన్ను మానసి కంగా హింసించారని సత్యవేడు ప్రజలు నాతోనే ఉన్నారని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేసినా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం..🔥🔥
క్యారక్టర్…క్రిడిబులీడి పెద్దిరెడ్డికి అసలు ఉందా..?
డబ్బు ఇస్తే…కారు పెడితే… భోజనం పెడితే చాలు సభలకు వస్తారని పెద్దిరెడ్డి అనుకున్నాడు…
పెద్దిరెడ్డికి దమ్ము ధైర్యం… pic.twitter.com/gfzMgLl7bg
— Venugopal Reddy Chenchu (NRI TDP, USA) (@venuchenchu) January 28, 2024