Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన రాజధానిని నీనెందుకు కొనసాగించాలని అహంతో అమరావతిని మూడు ముక్కలుగా చేశారు జగన్. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ఇది అమలు కాలేదు సరికదా.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిరక్షరాశ్యుల నుంచి ప్రతీ ఒక్కరూ జగన్ పాలనను అహంతో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు జగన్ అహం మీద కొట్టిన చంద్రబాబు రాష్ట్రానికి మూడు రాజధానులు కాదు.. ఒక్కటే రాజధాని అని అది కూడా ‘అమరావతి’ అంటూ ప్రకటించారు. ఇది జగన్ అహంపై మొదటి దెబ్బ. 151 సీట్లతో ఉన్నామని గర్వం తలకెక్కిన వైసీపీ అధికార మదంతో చిరంజీవిని అవమానించారు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున ప్రధాని చిరంజీవిని దగ్గరకు తీసుకోవడం జగన్ అహంపై రెండో దెబ్బ పడింది.
ఇలా జగన్ తన అహంతో నలుగురికి చేసిన అవమానాన్ని కోట్ల మంది సాక్షిగా బదులు తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఓటమి, కష్టంను తానొక్కడే అనుభవించి విజయాన్ని మాత్రం తన అభిమానులు, అన్నకు గౌరవం దక్కేలా చేసిన పవన్ నిజంగా గొప్పవాడన్న సందేహం ఇప్పుడ స్టేట్ మొత్తం చెప్పుకుంటుంది.
తన పదవి కావాలని ప్రచారంలో తల్లిని, చెల్లిని ఉపయోగించుకున్న జగన్ అధికారం దక్కగానే వారినే రాష్ట్ర సరిహద్దుల నుంచి వెళ్లగొట్టారు. జగన్ ను సీఎం చేసేందుకు వేల కిలో మీటర్లు పాదయాత్రలు చేసిన చెల్లికి కనీసం తనతో పాటు స్టేజీపై కూర్చోనివ్వలేదు. అలాగే తన గెలుపునకు ప్రచారం చేసిన తల్లిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన జగన్ అభద్రత ఈ రోజు పవన్ చేసిన పనితో బయటపడింది.