Alert For Railway Passengers : విజయవాడ సెక్షన్లో భద్రతాపరమైన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి కాకినాడ – విశాఖ – కాకినాడ ప్యాసింజర్, గుంటూరు – విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్, రాజమండ్రి – విశాఖ ఇంటర్ సిటీ రైళ్లు రద్దు కానున్నాయి. తిరుపతి – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ సెప్టెంబరు 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబరు 7, 9 తేదీల్లో సామర్లకోట నుంచి బయలుదేరి తిరుపతి చేరుతుందని సమాచారం. ఈ విషయాన్ని గమనించి రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోగలరు.
Breaking News