CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయవాడ సింగ్ నగర్ లోని పాఠశాల వద్దకు రాగానే సిఎంపై దాడి జరిగింది. పాఠశాలలోని ఓ ఫ్లోర్ లో దాగిన నిందితులు జగన్ అక్కడికి రాగానే రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఎన్నికల వేళ జరిగిన ఈ దాడి ఘటన వైకాపా, టిడిపి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇది తెలుగుదేశం కుట్రేనని, ఘటన జరిగిన ప్రాంతం దగ్గరలోనే ఓ టీడీపీ నేత కార్యాలయం ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ మళ్లీ ఇప్పుడు రాయితో దాడి చేయించుకున్నారని టిడిపి నాయకులు పేర్కొంటున్నారు.