ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహం లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రముఖులను కలుసుకున్నారు. బెయిల్ తర్వత మొదటి సారి డిల్లీ పర్యటన కు వచ్చిన చంద్రబాబు ను పలువురు రాజకీయ నాయకులు కలుసుకున్నారు. తన పర్యటన ను ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబు దంపతులకు టిడిపి రాజ్యసభ సభ్యుడు కనక మేడలరవీంద్ర, ఇతర నాయకులు వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాద్ కి చేరుకున్నారు.