Supreme Court order : ఏపీ సీఐడీ నమోదు చేసిన ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడుతామని జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం చెప్పింది. ఏపీ సీఐడీ తనపై దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఏపీ సీఐడీ చంద్రబాబు పై వరుసగా కేసులు నమోదు చేస్తూ పోతున్నది. ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యింది. దీనిపై తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. అయితే గురువారం తీర్పు వస్తుందని అందరూ ఎదురు చూశారు. కానీ తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇక ఈ రోజు ఉదయం పైబర్ నెట్ కేసులో విచారణను మొదలుపెట్టింది. అయితే దీనిని 30 వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక ఈ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే ఏపీ సీఐడీ పెడుతున్న కేసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కేసులను పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా ఈనెల 30 వరకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.