AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులు చార్జి సీటు ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతుంది.
ఏ 1 గా చంద్రబాబు నాయుడు, ఏ 2 అచ్చం నాయుడు, ఏ 3గా గంట సుబ్బారావు, ఏ 4గా మాజీ ఐఏఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ పేర్లను సిఐడి తన చార్జి సీట్ పేర్కొంది. చంద్రబాబును నిందితుడుగా పేర్కొంటూ ఇప్పటికే ఫైబర్ నెట్ అసైన్డ్ భూముల కేసుల్లోనూ సిఐడి అధికారులు చాట్ సీటు సమర్పించారు.
నాడు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిఐడి అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గతంలో అరెస్ట్ చేశారు.దాదాపు రెండు నెలలపాటు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గడిపారు. గతేడాది అక్టోబర్ 31న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.