- జీవో నంబర్ 1పై నిర్ణయం తీసుకోనున్న న్యాయస్థానం
AP High Court Go No 1 : ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ ఏపీ ప్రధాన న్యాయస్థానం మరికొన్ని గంటల్లో తన తీర్పును వెల్లడించనుంది. రోడ్లపై రాజకీయ పార్టీల సభలు, రోడ్ షోలను అడ్డుకునేలా తెచ్చిన ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇప్పటికే తీర్పును రిజర్వు చేసింది. కాగా శుక్రవారం వెలువరించనుంది.
తీర్పుపై ఉత్కంఠ..
రోడ్లపై సభలు, రోడ్ షోలను కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఈ జీవో నంబర్ 1ను అమల్లోకి తెచ్చింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే అంటూ ఆయా పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏప కాంగ్రెస్ నేత వీర వెంకటరుద్రరాజు, మరికొందరు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చట్టాలు సరికావని కోర్టును ఆశ్రయించారు. ప్రతి పక్షాలను అడ్డుకోవడంలో భాగంగా జగన్ సర్కారు ఈ జీవో తెచ్చిందని కోర్టులో పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే న్యాయ స్థానం విచారణ పూర్తి చేసింది. గతంలోనే ఈ తంతు ముగిసింది. తీర్పును రిజర్వు చేసింది. కాగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, డీవీఎస్ సోమయాజులుతో కూడిన బెంచ్ తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నింపింది. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుండగా, తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వారు సుప్రీం కోర్టును అశ్రయించే అవకాశమూ లేకపోలేదు.