33.4 C
India
Friday, May 3, 2024
More

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Date:

    Elon Musk
    Elon Musk

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల 21, 22 తేదీల్లో భారత్ లో పర్యటించాల్సి ఉండగా, ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడింది. ‘టెస్లాలో వ్యాపారం పరంగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించడం వల్ల భారత్ పర్యటన ఆలస్యం అవుతుంది. కానీ, ఈ ఏడాది చివరలో సందర్శించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపుతున్నాను.’ అని మస్క్ ఎక్స్ ద్వారా వివరించారు.

    గత నెలలో, భారత్ 500 మిలియన్ డాలర్లు (£399 మిలియన్) పెట్టుబడి పెట్టేందుకు, మూడేళ్లలో స్థానికంగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్న ప్రపంచ కార్ల తయారీదారుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై (ఇవి) దిగుమతి పన్నులను తగ్గించింది.

    భారత్ తీసుకున్న నిర్ణయంతో టెస్లా భారత్ లో పెట్టుబడులు పెట్టనుంది. 2021లో, ఎలాన్ మస్క్ భారతదేశం అధిక దిగుమతి సుంకాలను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో సంస్థ తన కార్లను విడుదల చేయకపోవడానికి కారణమని పేర్కొన్నారు.

    టెస్లాను ఆకర్షించడానికి కొన్ని ఉత్సాహవంత రాష్ట్రాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేస్తున్నారు. టెస్లాకు సంబంధించి ఆయన ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించలేదు. వాయిదా అంటే ఆంధ్రప్రదేశ్ కు సన్నద్ధం కావడానికి మరింత సమయం ఉంటుంది.

    అలాగే, ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే టెస్లా మ్యానిఫ్రాక్చింగ్ యూనిట్‌ ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, కియా మోటార్స్ వంటి బడా కంపెనీలను ఏపీకి తీసుకువచ్చిన అనుభవం, ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడికి ఉంది.

    పీపీఏల రద్దు, రివర్స్ టెండరింగ్ తో పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేయడం, ఆయన ఎంపీలు కియా మోటార్స్ అధికారులను బహిరంగంగా బెదిరించడం వంటి కారణాలతో జగన్మోహన్ రెడ్డికి వ్యాపార వ్యతిరేక ఇమేజ్ ఉంది.

    కియా మోటార్స్ భారతదేశానికి ఇప్పటికీ అతిపెద్ద ఎఫ్‌డీఏ అని, అది చంద్రబాబు నాయుడి నాయకత్వంలో జరిగిందని మన పాఠకులు గుర్తు చేయవచ్చు. టెస్లా ఆంధ్రప్రదేశ్ కు వస్తే విభజన తర్వాత ఇప్పటి వరకు సాధించిన అతి పెద్ద విజయం అవుతుంది. అలాగే, తయారీ పరిశ్రమ రాష్ట్రంలో అనేక ఉద్యోగాలను సృష్టిస్తుంది. కాబట్టి టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా కలిసి వచ్చేలా కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....