Literary celebrations : జూన్ 11న అన్ని జిల్లాల్లో సాహితీ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహసభలను నిర్వహించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ కవులను అవమానపరిచారని విమర్శించారు. సాహితీ ఉత్సవాల్లో భాగంగా తెలుగు.. ఉర్దూ భాషల్లో పోటీలు నిర్వహించిన కవులను గుర్తింపు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఉత్సవాల్లో కవులు.. సాహితీ వేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.