28.5 C
India
Sunday, May 19, 2024
More

    Nara Bhuvaneshwari: ఉమ్మడి గుంటూరు,ప్రకాశంజిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

    Date:

     

    –  మీతో మేమున్నాం…అధైర్యపడకండి
    – బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా
    – రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి
    – ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం

    AP: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, వారికి భరోసా ఇస్తున్నారు. మేము మీతో మేమున్నాం..అధైర్యపడొద్దని ఆమె  ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సందర్భంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరుజిల్లాలో పర్యటించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నాలుగు బాధిత కుటుంబాలను పరామర్శిం చారు. కార్యక్రమానికి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదటగా రేపల్లె నియోజకవర్గానికి చేరుకున్నారు. చెరుకుపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

    09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వరరావు(67) మృతి చెందారు. వెంకటేశ్వరరావు భార్య కోట విజయలక్ష్మి, కుమారులు సురేష్, రాజేష్, ఇతర కుటుంబ సభ్యు లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షలు చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామం లో పార్టీ కార్యకర్త మువ్వ సింగారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 05-10-2023న సింగా రావు(52) గుండెపోటుతో మృతిచెందారు. సింగారావు భార్య పార్వతి, తల్లి మస్తానమ్మ, కుమార్తెలు కళ్యాణి, హిమబిందులను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిసాయం చేశారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భువనేశ్వరి నివాళులు అర్పించారు.

    అనంతరం పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో పార్టీ కార్యకర్త టెక్కెం నాగేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 10-09-2023న గుండెపోటుతో నాగేశ్వరరావు(57) మృతిచెందారు. నాగేశ్వరరావు భార్య దేవునిదయ, కుమార్తె వెంకటరత్నం, తల్లి నాగరత్నం లను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరావు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు రూరల్ నియోజకవర్గం, ముక్తినూతలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త సూదనగుంట వెంకటరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామ ర్శించారు. 13-10-2023న వెంకటరావు(50) గుండెపోటుతో మృతిచెందారు. వెంకటరావు తమ్ముడు వేణు,తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. మొదటిరోజు కార్యక్రమం ముగిసిన అనంతరం ఒంగోలులోని బృందావనం కన్వెన్షన్ సెంటర్ వద్ద బస చేశారు.

    భువనేశ్వరికి వెల్లువెత్తిన మహిళల మద్దతు, సంఘీభావం:-

    నారా భువనేశ్వరి నిజం గెలవాలి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున భువనేశ్వరికి మద్దతు తెలిపారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాల ఇళ్ల వద్ద మహిళలు పెద్దఎత్తున చేరుకుని భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భువనేశ్వరి అభివాదం చేస్తూ ముందుకు కొనసాగారు. భువనేశ్వరితో కరచాలనం చేసి, ఫోటోలు దిగేందుకు పిల్లలు, మహిళలు పెద్దఎత్తున పోటీపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్ర తోనే పెన్షన్ దారులకు ఇబ్బందులు: కనపర్తి శ్రీనివాసరావు

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్రతోనే రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి నారా లోకేష్ దంపతులు..

    Tirumala : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ...