Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.
పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో నారా భువనేశ్వరి కేక్ కట్ చేసి 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. నిజం గెలవాలి టీం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.
భువనేశ్వరి ఎమ్మెల్సీ అనురాధ తెలుగు యువ త రాష్ట్ర నాయకులు రవి నాయుడు, జశ్వంత్, నారా ప్రశాంత్ కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ నీ ఎన్టీఆర్ స్థాపించారనీ టిడిపి నేతలు తెలిపారు.