Chandrababu : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండాలతో సమావేశమయ్యారు.
మూడు పార్టీల పొత్తు ఖరారు అయిన నేపథ్యం వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తు లో భాగంగా సీట్లు సర్దుబాటుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన, టిడిపి కొన్ని సీట్లు పంచుకోగా మరికొన్ని సీట్లను బిజెపి కోసం కొన్ని సీట్లను వదిలేశారు.
పొత్తుపై గతంలో క్లారిటీ రాకపోవడంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు కేంద్ర నాయకత్వం పొత్తు పై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్ల విష యంలో ప్రస్తుతం మూడు పార్టీల నేతలు తీవ్రంగా చేస్తున్నారు.