Ponguleti and Jupalli : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. జూన్ 25 లేదా 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక వచ్చే అవకాశం ఉంది. వీరి సమక్షంలో పొంగులేటి, జూపల్లి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయ సమాచారం.
కాగా పొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు పలుమార్లు వీరితో చర్చలు జరుపుతున్నారు. అయితే వీరిద్దరు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీంతో పొంగులేటితో చర్చలు జరిపారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.