దశాబ్దాలుగా విజయవాడ బెంజి సర్కిల్ లో ఉన్న దివంగత నేత కాకాణి వెంకటరత్నం విగ్రహాన్ని 2018 మేలో బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో అక్కడ నుంచి తొలగించాల్సి వచ్చిందని, ఐదేళ్ల తర్వాత ఇవాళ తిరిగి కాకాణి విగ్రహాన్ని బెంజి సర్కిల్లో పెట్టామని వైసిపి నేత దేవినేని అవినాష్ తెలిపారు.. కౌన్సిల్ లో తీర్మానం చేసి కాకాణి విగ్రహం ఇక్కడ స్థాపించినట్లు తెలిపారు. అభివృద్ది పనుల పేరుతో గతంలో తీసి వేసిన విగ్రహాలు సీఎం జగన్ సూచన మేరకు పునః ప్రతిష్ట చేస్తున్నామన్నారు. కాకాణి విగ్రహం ఏర్పాటుకి పూర్తిగా సహక రించిన సీఎం జగన్ కు అయన కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో దీనిని కాకాణి సర్కిల్ గా నామకరణం చేసే విధంగా కార్పోరేషన్ లో కృషి చేస్తామన్నారు.