YCP Vs Janasena
YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు.. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జగన్ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు..
17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన 100 మంది జనసేన పార్టీకి చెందిన యువకులు జానీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసిపిలో చేరారు.. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకి చెందిన నాయీ బ్రాహ్మణ సోదరులు దాదాపు 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు రాగా ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న మోసలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఆ పార్టీలను వీడుతున్నారని గుర్తు చేశారు.. ఓటు వచ్చిన తొలిసారి జగన్ కి ఓటు వేయాలని సంకల్పంతో వైసిపిలో చేరటం సంతోషంగా ఉందన్నారు.. ఎక్కువ శాతం యువకులు జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు.. వారు నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వైసీపీలో చేరటం అభినందించదగ్గ విషయమని చెప్పారు.. ఇంతమంది యువకులను వైసీపీలో చేర్చి వారికి మంచి భవిష్యత్తు చూపించిన జాని కి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు..
అనంతరం జానీ మాట్లాడుతూ దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే విధంగా కష్టపడి పని చేస్తామని చెప్పారు.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి అవినాష్ చేసిన కృషి కారణమని చెప్పారు.. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తోపాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.