Vishwa Hindu Parishad: హిందూ బంధువులను ఏకం చేసేందుకు విశ్వ హిందూ పరిషత్ విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా 04 సెప్టెంబర్, 2023 రోజున విజయవాడలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ‘విజయవాడ మహానగర ఎలైట్ మీట్’ విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలిద్ పరండేజీ పాల్గొన్నారు.
పరిషత్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, చేట్టాల్సిన వాటిపై విస్తృతంగా చర్చించారు. విశ్వ గురువుగా ఎదుగుతున్న భారత్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందూ బంధువులను ఒక్కటి చేసేందుకు విరివిగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్య మతాల మత మార్పిడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలిద్ పరండేజీని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం శాలువాతో సత్కరించి స్వామి వివేకానంద డైరీని బహూకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నేషనల్ జాయింట్ సెక్రటరీ రాఘవులు, పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, కోనేరు దుర్గాప్రసాద్, విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వెంకటేశ్వర్లు, విజయవాడ మహా నగర హిందుత్వ ప్రముఖులు పాల్గొన్నారు.