- అమెరికాలో ఓ మహిళా ఘాతకం ఆలస్యంగా వెలుగులోకి..
అమెరికాకు చెందిన ఓ వివాహిత ఇటీవల ఓ పుస్తకం రాసి ఫేమస్ అయ్యింది. తనకు అనునిత్యం తోడుగా నిలిచే భర్త మరణం తర్వాత తాను ఎదుర్కోన్న కష్టాలు, తన వేదన, ఒంటరిగా ఎదురైన పరిస్థితులను ఆ పుస్తకంలో ఆమె వివరించింది. తన భర్తతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆర్ యు విత్ మి అనే పుస్తకాన్ని ఆమె రాసింది. ఆమెరికాలో చాలా మంది చదివి ప్రశంసలు కురిపించారు కూడా. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఆమెకు ఎదురైంది. సడెన్ గా పోలీసుల ఎంట్రీ ఆమె అసలు బండరాన్ని బయట పెట్టింది.
అసలేం జరిగిందంటే..
డార్డెన్ రిబిన్స్ అనే మహిళ భర్త గతేడాది మార్చి 4న చనిపోయాడు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అతను మృతి చెందాడు. ముందుగా ఆ రోజు తన భర్త అస్వస్థతకు గురయ్యాడని కాపాడాలని ఆమె అత్యవసర వైద్య సిబ్బందికి (కాల్ సెంటర్) కాల్ చేసింది. వారు వచ్చేసరికి స్పృహ కొల్పోయి ఉన్న ఆ వ్యక్తని సిబ్బంది దవాఖానకు తరలించి చికిత్స మొదలు పెట్టారు. కాసేపటికి ఆయన మృతి చెందాడు. మద్యం అతిగా తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యాడని ఆమె పోలీసులకు తెలపింది. కానీ వైద్యుల పరీక్షల్లో అతిగా డ్రగ్ తీసుకున్నందునే మృతి చెందాడని తేలింది. దీంతో పోలీసులు విచారణ పక్కాగా మొదలుపెట్టారు.