Wife condition : చట్టాల గురించి తెలుసుకోవడమో.. తల్లిదండ్రుల బలం చూసుకునో ఏమో గానీ భార్యలు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు భర్తను విడిచిపెట్టి వెళ్తున్నారో.. ఎందుకు అత్తింటివారిని వీధికి లాగుతున్నారో అస్సలు తెలియడం లేదు. వారి కోర్కెలు వింటే కూడా ఈ రకంగా భర్తలకు వేధింపులు ఉన్నాయా? అని మహిళా సంఘాలే ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అసలు విషయాలనికి వస్తే..
రాజస్థాన్ లోని బన్స్వారాలో ఒక భర్తకు వింత సమస్య ఎదురైంది. అదేంటంంటే?. గతంలో ఒక సామెత ఉండేది ‘పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు’ అని. పిత్రు స్వామ్య వ్యవస్థలో స్త్రీలకు మాత్రమే ఆపాదించేలా ఈ సామెత వచ్చింది. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మంచి పురుషుడు భర్తగా దొరకడు అని. ఈ సామెత పుట్టిన కాలంలో బహు భార్యత్వం, వివాహేతర సంబంధాలు కామన్ గానే ఉండేవి కాబోలు.
కానీ ఇప్పుడు ఈ సామెత పురుషులకు అన్వయం అవుతుంది. అంటే ‘పుణ్యం కొద్దీ భార్య, ధర్మం కొద్దీ అత్తింటి వారు’అని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భార్య భర్తను అత్తింటి వారిని వేధింపులకు గురి చేస్తూనే ఉంటుంది. ఇక భార్య తరుఫు తల్లిదండ్రులు తమకు లొంగి ఉంటేనే కాపురం చేయనిస్తాం అంటు బాహాటంగానే చెప్తున్నారు. దీంతో భార్యలు అర్థం పర్థం లేదని షరతులు విధిస్తూ భర్తలను బాధలు పెడుతున్నారు.
రాజస్థాన్ కు చెందిన చిరాగ్ ఇండోర్ కు చెందిన నేహా జైన్ ను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గతేడాది (2023)లో జరిగింది. ఏడాదిలోపే నేహా జైన్ తనలోని మరో మనిషిని బయటకు తీసింది. భర్తకు చెప్పకుండా పుట్టింటివి వెళ్లింది. దీంతో భర్త ఆమెను రమ్మని కోరాడు. తనకు రోజు మందు, మాంసం ఉంటేనే కాపురానికి వస్తానని చెప్పింది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నడుస్తోంది.