Crime News : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద సిగ్నల్ వేయకుండా నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సామినేని రాజా (29), సామినేని భార్గవి (24)గా పోలీసులు గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. వారాంతంలో హైదరాబాద్ వచ్చిన వీరు.. నగరం నుంచి విజయవాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీసి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.