- కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు
NDA Government : వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనంతపురంను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హంద్రీనీవాతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం నిర్వహించిన ఎన్డీయే కూటమి సభలో వారు మాట్లాడారు. జగన్ ను ఇంటికి పంపి మళ్లీ రాష్ట్రాన్ని అభావృద్ధి చేసుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టకున్నాయని తెలిపారు.
ఆ తర్వాత సాయంత్రం అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తన మనసుకు దగ్గరగా ఉంటుందని అన్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ప్రజలను చూసి ఎండలు భయపడుతున్నాయని అన్నారు.