Moosapet : హైదరాబాద్ లో ఇద్దరు కామాందుల ఘాతుకానికి ఓ మహిళ మృతి చెందింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ (45)పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సీసీ కెమెరాలను పరిశీలించగా.. మహిళతో మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా స్థానిక దుకాణం సెల్లార్ లోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారు జామున ఈ దారుణం జరిగినట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. నిందితులు బైక్ పై కూకట్ పల్లి వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్న సెల్లార్ చాలా లోతుగా ఉండడంతో రోడ్డుపై నుంచి చూసినా మృతదేహం కనిపించదు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.