Married Womanమహిళలపై అత్యాచారాలు, దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. షీ బృందాలను ఏర్పాటు చేసిన ఎక్కడికక్కడ నిఘా ఉంచుతోంది. అయితే సర్కార్,పోలీసు యంత్రాంగం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వారిపై రేప్లు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
హన్మకొండ నయీంనగర్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈనెల 27న తన స్వంత పని మీద బయటకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తున్న ఓ మహిళపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేయూ క్రాస్ రోడ్డ్ వద్ద ఆటో ఎక్కిన ఆ మహిళ తనను రంగ్బార్ వద్ద దింపాలని కోరారు. దీంతో ఇదే అనుకూలమని భావించిన సదరు ముగ్గురు ఆటో డ్రైవర్లు..ఆమెను భీమారం గ్రామ శివారులోకి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలోనే తనను కాపాడాలని సదరు మహిళ అరవడం ప్రారంభించింది. దీంతో ఆమెను బెదిరింపులకు గురి చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు భీమారం శివారు ప్రాంతంలోనే ఆటో సౌండ్ బ్యాక్స్ ఎక్కువగా పెట్టి రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రంగ్బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే జరిగిన సంఘటనను సదరు మహిళ వారి బంధువులకు చెప్పడంతో..వారు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ముగ్గురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.