Water : బోరు వేస్తే నీళ్లు ఎక్కడ పడతాయోనని కొబ్బరి కాయ పట్టుకుని పరిశీలిస్తారు. నీటి ఊట ఉన్న ప్రాంతంలో నీటి గలగలలు వినిపిస్తాయి. దీంతో అక్కడ బోరు వేయాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ జిల్లాలోని చింతల బస్తీలో ఓ సామాజిక భవనానికి ఎంపీ నిధులతో పవర్ బోరు మంజూరైంది. దీంతో బోరు వేయడానికి నాయకులు ఉపక్రమించారు. బోరు వేసేందుకు మిషన్ కూడా వచ్చింది. కొబ్బరికాయ పట్టుకుని నీటి జాడలు గమనించి రోడ్డు మీదే బోరు వేశారు.
బోరు మూడు మీటర్లు పడగానే నీరు ఉబికి వచ్చింది. దీంతో అందరు కంగారు పడ్డారు. ఇంత తొందరగా నీళ్లు పడటం ఏమిటని ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే అక్కడ మంచినీటి పైపులైన్ ఉండటంతో అలా జరిగిందని గుర్తించారు. తరువాత మళ్లీ బోరు వేయడం ప్రారంభించగా దాదాపు 40 అడుగుల లోతులో మళ్లీ ఓ నీటి పైపులైన్ తగిలింది.
ఇలా రెండు సార్లు పైపులైన్ తగలడంతో బోరు సక్సెస్ కాలేదు. కొబ్బరికాయ తెచ్చిన తంటాతో నీటి ఊట అనుకుని పైపులైన్లకు ఆటంకాలు కలిగించారు. ఈ నలభై అడుగుల లోతులో వేసిన పైపులైన్ మాత్రం ఎప్పుడో యాభై ఏళ్ల కింద వేసిందట. దీంతో సదరు బోరు వ్యవహారం వివాదంగా మారింది. మరోవైపు స్థలం లేక రోడ్డు మీద వేయడంతో అందరు విమర్శించారు. నడిరోడ్డుపై వేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
పైపులైన్లు బోరుకు అడ్డం రావడం నిజంగా యాదృచ్ఛికమే కానీ అనుకున్నట్లుగా కావడం గమనార్హం. ఇలా పైపులైన్ల వల్ల ఓ బోరు పడకుండా పోయింది. కొబ్బరికాయ నీటి జాడలు సూచిస్తుందని చెబుతుంటారు. కానీ ఇలా నల్లా పైపులైన్లు సూచిస్తుందని మాత్రం గుర్తించలేకపోయారు. ఇలా బోరు నిధులు వృథాగా పోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
ReplyForward
|