![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/Screenshot-2023-09-05-151512123.png)
చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో డీఎంకే నాయకుడు రాస్తారు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఇంతకీ ఈ నటుడు కమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఈయన చేసిన వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో ఎందుకు దుమారం రేపుతున్నాయి? అనేది చూద్దాం..
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద మాట్లాడుతూ డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి సనాతనాన్ని నిర్ములించాలంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నటి కస్తూరి ఈ వ్యాఖ్యలపై మండిపడుతూ ఉదయనిధి స్టాలిన్ పై ఫైర్ అయ్యింది.. ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా ఈమె వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి.
‘మీ కుటుంబంలో మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందితే మీరు వాటితో ఏం చేయాలని అనుకుంటున్నారు. సనాతనపై మీకు ఇంత ద్వేషం ఉంటే హిందూ దేవాలయాల ఆస్తులను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటితో మీకు పనేంటి? అంటూ ప్రశ్నించారు. ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా అందరు ఈమెకు మద్దతు తెలుపుతున్నారు..
అలాగే ఈయన వ్యాఖ్యలకు రాజకీయ నాయకులూ సైతం ఫైర్ అవుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ సైతం మండిపడుతుంది.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈయన ప్రసంగాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నారు. ఈయనపై కేసులు కూడా నమోదు అవుతున్న ఉదయనిధి స్టాలిన్ ధీటుగా సమాధానం చెబుతున్నారు. నాపై ఎన్ని కేసులు వచ్చిన పోరాటానికి సిద్ధం అంటూ చెబుతున్నారు..